Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య మండల కేంద్రమైన గుడ్లూరు లోని ఓ వేడుకకు హాజరై అమరావతి జ్యోతి ఎడిటర్ గుర్రం ఆదినారాయణ ఇంటికి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న మండలంలోని అభ్యుదయ హైస్కూల్ (ప్రైవేట్ స్కూల్) కి చెందిన ఉపాధ్యాయినిలు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ ఆధ్వర్యంలో జొన్నలగడ్డ జ్యోతి, అద్దంకి రాజేశ్వరి, కర్పూరపు పావని అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి ఇంటూరి సౌజన్యతో మాటా మంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సౌజన్య ప్రశ్నించడంతో ఆ ఉపాధ్యాయునిలు తమ సమస్యను విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం హర్షించదగ్గ విషయంమన్నారు .ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలలకు ఒకే విధమైన విధానాలు అమలు చేస్తుండడం హర్షించదగ్గ విషయం. పండగ సెలవులు ఒకే విధంగా నిర్వహించడం, రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించడం గాని తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ అందజేయడం ఇటువంటి అన్ని విషయాలలో ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఒకే విధమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ మహిళా ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన చైల్డ్ కేర్ సెలవులు విషయంలో మాత్రం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు ఆ నిబంధనలు అమలు చేయడంలేదు. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీలకు కూడా ఈ నిబంధన అమలు చేసినట్లయితే ఎంతోమంది ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినిలకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే ద్వారా తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి మహిళా ఉపాధ్యాయినిలకు ప్రయోజనం కలిగించేలా చూడాలని వారు కోరారు. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజా సమస్యలపై ఇంటూరి నాగేశ్వరరావు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సౌజన్య ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి, ఇంటూరి సౌజన్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆమె వెంట జిల్లా టెలికాంబోర్డు డైరెక్టర్ గుర్రం మాల్యాద్రి సతీమణి గుర్రం రాజ్యలక్ష్మి, అబ్బూరి చందు తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi