Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: మండల కేంద్రమైన గుడ్లూరు భవిత కేంద్రంలో స్వర్గీయ వేముల బాబురావు 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు దివ్యాంగ విద్యార్థులకు, ఎం ఆర్ సి కార్యాలయ సిబ్బందికి బాక్సులు అందజేయడంతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ బాబురావు సతీమణి రమాదేవి మాట్లాడుతూ తన భర్త గుడ్లూరులో ప్రముఖ బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు.16 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ప్రతి ఏటా అప్పుటి నుండి ఇప్పటివరకు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గుడ్లూరు భవిత కేంద్రంలో పని చేస్తున్న ఐ ఆర్ పి శరత్ కోరిక మేరకు విద్యార్థులకు తమ భర్త వర్ధంతి సందర్భంగా చిన్న పాటీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తామని బాబురావు కుమారులు కిరణ్ కుమార్ ,వంశీకృష్ణ తెలిపారు. , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, భవిత కేంద్రం ఐఆర్పీలు శరత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi