Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నాలుగవ రోజు ఇంటింటి ప్రచారంలో ఇంటూరి సౌజన్య కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరులోని 9వ వార్డు ఆది ఆంధ్ర కాలనీలో, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి ఇంటూరి సౌజన్య 4వ రోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు..ముందుగా కాలనీ లోకి వచ్చిన ఇంటూరి సౌజన్య కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు... .. మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ *బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ* పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఇంటూరి నాగేశ్వరరావు ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మనకు, మన బిడ్డలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ద్రోహం చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఈసారి కందుకూరులో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు చేవూరి రమేష్ బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, వార్డులోని మహిళలు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, వార్డు నాయకులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, ఇమ్నానియల్, పర్సు నాగేశ్వరరావు, మద్దాలి రమేష్ చదలవాడ దశరథ, పర్సు కోటయ్య, గోచిపాతల కొండయ్య, వంకాయలపాటి కోటేశ్వరరావు, చదలవాడ దావీదు, చదలబాట శీను, ఉచ్చులూరి సుబ్బారావు, చదలవాడ సురేంద్ర, దామా మల్లికార్జున, ధామ కోటేశ్వరరావు, ఆలా ప్రసాద్, కంచర్ల గోపి, అత్తోట మాల్యాద్రి ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi