Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ కందుకూరు,అమరావతి జ్యోతి ; చిత్తూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభు నడిచిన మార్గం ప్రేమ శాంతి సహనం ఇలాంటి గుణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ఆయన చూపించిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, ఏసుప్రభు చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆకాంక్షించారు.
Admin
Amaravathi Jyothi