Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం:మండలంలోని పెద్దపవని గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం దద్దరిల్లింది. టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతూ సందడి చేశారు. మంచి మనసున్న మా మనిషి నాగేశ్వరరావుకు అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెప్పారు.పెదపవని గ్రామంలో ఎక్కువగా నివసించే ముస్లిం మైనారిటీ, బలహీన వర్గాల వారందరికీ రాబోయే ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని నాగేశ్వరావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లు, మల్లికార్జున, సుబ్బారావు, భాను తదితరులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెపాటి సాంబయ్య, మాజీ ఎంపీపీ గూడూరి కల్పన, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు నాయబ్ రసూల్, షేక్ రఫీ, కిలారి కొండప నాయుడు, రామిశెట్టి మాలకొండయ్య, కరీముల్లా, బొప్పూరి సిద్దయ్య, సత్తెనపల్లి కొండలరావు, సత్తెనపల్లి రాఘవేంద్ర, పందల వినయ్, జనసేన నాయకులు కోటిపల్లి దినేష్, మలిశెట్టి మనోహర్, సామాను అఖిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi