Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉన్నతి పథకం ద్వారా పదిమంది మహిళలకు ఆటోలు పంపిణీ. నెల్లూరు అమరావతి జ్యోతి: ఉన్నతి పదకం ద్వారా జిల్లాలో 10 మంది మహిళలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర రెడ్డి,జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ,మేయర్ స్రవంతి తదితరులు మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఆటోల పంపిణి చేశారు. రాష్ట్రంలో మొదటి విడతగా 220 ఆటోలు మంజూరు కాగా నెల్లూరు జిల్లాకు 10 మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభవృద్ధికి,అభ్యున్నతికి ,మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు
Admin
Amaravathi Jyothi