Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసీపీకి గుడ్ బై తెలుగుదేశం పార్టీకి జై ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీగా వలసలు కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణం 3వ వార్డు ఉప్పుచెరువు ప్రాంతంలో .అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి... నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంటూరి నాగేశ్వరరావు గెలుపు కోసం, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు శాయశక్తులా పనిచేస్తామని కొత్తగా పార్టీలో చేరిన వారు స్పష్టం చేశారు. రాబోయే ప్రభుత్వంలో మీ అందరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని నాగేశ్వరరావు తెలియజేశారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటానని.... రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు నాయకులు వేముల ప్రసాద్, వేముల ఫణీంద్ర, భవనాసి వెంకటేశ్వర్లు, గుర్రం మధు, షేక్ కరీముల్లా, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి చిలకపాటి మధుబాబు, రాష్ట్ర వాణిజ్య భాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్డెళ్ళ రవిచంద్ర,నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ సలాం, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు వేణు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పులి నాగరాజు, పోకూరి రాంబాబు, కొమ్మి వెంకట ప్రవీణ్, యర్రా ముసలయ్య, షేక్ ఫిరోజ్, ముప్పవరపు వేణు, దాసరి ప్రమోద్, బద్దిపూడి శిఖామణి తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi