Monday, 20 April 2026 05:26:22 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బి ఆర్ ఆక్స్ ఫర్డ్ లో రహదారి భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని సూచనలు ఇచ్చిన ఆర్టీవో రఫీ

Date : 01 December 2023 09:39 AM Views : 186

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బి ఆర్ ఆక్స్ ఫర్డ్ లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు పలు సూచనలు ఇచ్చిన అర్ టి ఓ రఫీ కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు ఉపరవాణా కమిషనరు బి చందర్ ఆదేశముల మేరకు గురువారం స్థానిక బి. ఆర్ ఆక్స్ ఫర్డ్ జూనియర్ కళాశాల నందు రహదారి భద్రతపై అవగాహనా సదస్సును ఏర్పాటు చేయడమైనది. ఇందులో భాగంగా కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి ఎస్ కె యండి రఫీ మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ట్రాఫిక్ నియమ నిబంధనలగురించి అందరికి అవగాహన ఉండాలని, అదేవిధముగా రహదారి భద్రత గురించి అందరు తెలుసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహితముగా వాహనములను నడుపవలెనని తెలియచేసారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవతా దృక్పదంతో తమవంతు సహాయము చేయాలని, ప్రతి ఒక్కరు రహదారి భద్రతలను పాటిస్తూ ప్రమాదముల బారినపడకుండా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మట్ ధరించి వాహనము నడుపవలెనని తెలియచేసారు. అదేవిధంగా వర్షాకాలం కావడం వలన వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉంటాయి కావునా ప్రతి ఒక్క వాహనదారునికి విజ్ఞప్తి ఏమనగా నీటి ప్రవాహము తగిన తరువాత మాత్రమే ప్రయాణము కొనసాగించవలెనని లేనిచో అనవసరముగా ప్రాణహాని జరుగునని అదేవిధముగా స్కూల్ మరియు కాలేజీ బస్సులు నడుపు డ్రైవర్లు జాగురతతో వాహనమును నడిపి స్కూల్ మరియు కాలేజీ విద్యార్థిని విద్యార్థులను వారి వారి గమ్యస్థానములకు సురక్షితంగా చేర్చవలెనని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో రహదారి భద్రత పట్ల కూడా అవగాహన అంతే ముఖ్యమని, మనము వాహనమును నడుపునపుడు మన భద్రత ఎంత ముఖ్యమో అదేవిధముగా ఎదుటివారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదములు జరుగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాద రహితంగా వాహనములు నడుపవలెనని తెలియచేసారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :