Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వైసీపీ నాయకులకు దడ పుట్టిస్తున్న ఇంటూరి సౌజన్య ప్రచారం వలేటివారిపాలెం : కందుకూరు నియోజకవర్గం టిడిపి, జనసేన,బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య వలేటివారిపాలెం మండలంలోని పోకూరు, నూకవరం పంచాయతీల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోకూరు పంచాయతీ ఎస్సీ కాలనీలోని చర్చిలో పాస్టర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సౌజన్యని ఆశీర్వదించారు.రాష్ట్ర రాజధాని, యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు కావాలంటే నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావుని, పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, పూర్తిస్థాయిలో న్యాయం చేకూరుస్తుందని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ఓటర్లకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. ఈ ప్రచార కార్యక్రమంలో నూకవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు దాచర్ల శ్రీనివాసరావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు బద్దిపూడి శిఖామణి, ఇంటూరి యలమంద, ఇంటూరి రవి, మన్నం శ్రీనివాసరావు, దాచర్ల హరిబాబు, బాలకృష్ణ, బద్దిపూడి మల్లిశకార్జున్, దాచర్ల మల్లికార్జున్, పేముల నాగభూషణం, పోకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ముళ్ళమూడి మాల్యాద్రి, క్లస్టర్ ఇంచార్జ్ సోమినేని తిరుమలరావు, తెలుగు యువత అధ్యక్షుడు చెన్నారెడ్డి మహేంద్ర, నల్లమోతు రవీంద్ర, నవ్వులూరి సుబ్బానాయుడు, ఘటమనేని సురేష్, చెన్నారెడ్డి మహేష్, అత్తోట కార్తీక్, సోమినేని వెంకట్రావు, మాజీ సర్పంచ్ ఘటమనేని వెంకటేశ్వర్లు, నాగభూషణం వెంకటేశ్వర్లు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, పట్టణ అధ్యక్షుడు మన్నేపల్లి వరప్రసాదరావు, జనసేన నాయకుడు చేజర్ల మణికంఠ, పట్టణ మహిళా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ, పట్టణ కమిటీ మహిళలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi