Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కందులూరు లో వైసీపీకి షాక్ - టిడిపిలో చేరిన 50 కుటుంబాలు టంగుటూరు, అమరావతి జ్యోతి: ప్రజా ప్రభుత్వం టిడిపి తోనే సాధ్యంమని కొండేపి నియోజకవర్గంలో టిడిపి పార్టీ ని గెలిపించుకుందాంమని, నియోజకవర్గ అభివృద్ధి భాద్యత నాదీ అని ఎమ్మెల్యే స్వామి నాయకులు కార్యకర్తలు కు భరోసా కల్పించారు. మండలంలోని తూర్పు నాయుడు పాలెం లో ఎమ్మెల్యే స్వామి స్వగృహంలో ఆదివారం మండలంలోని కందులూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసిపి పార్టీ నుంచి టిడిపి లో కి దామచర్ల బసవయ్య అద్వరంలో ఎమ్మెల్యే స్వామి సమక్షంలో టిడిపి పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి యాభై సంవత్సరాలు వెనక్కి పోయిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి ని చేయాల్సిన బాధ్యత మనదే. కొండేపి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో టిడిపి అధికారంలోకి రాగానే త్రాగు సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం చేస్తా. సంగమేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. కొండేపి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో టిడిపి హయాంలో అభివృద్ధి కనపడుతుంది తప్ప వైసిపి హయాంలో ఎన్ని రోడ్లు వేసారో. రాష్ట్ర ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక పాలన చూసి వైసిపి నాయకులు ఆ పార్టీ పట్ల అసూయతో రాష్ట్ర అభివృద్ధి చేసేది చంద్రబాబు అని నమ్మకం తో ప్రజలు వైసిపి పార్టీ నుంచి టిడిపి లో కి వేలమంది చేరుతున్నారు. రాష్ట్రంలో వైసిపి పని అయిపోయింది. అనంతరం కందులూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ ను వీడి టిడిపి లో కి 50 కుటుంబాలు చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కామని విజయకుమార్. మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్. టిడిపి నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు. టిడిపి నాయకులు దామచర్ల శ్రీనివాసులు. దామచర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi