Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *ఫీజులను చెల్లించ లేదని విద్యార్థులను గెంటివేసిన నర్సింగ్ కళాశాల యాజమాన్యం* కావలి, అమరావతి జ్యోతి : కావలి పట్టణంలోని శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని విద్యార్థులను శనివారం కాలేజీ నుంచి బయటకు గెంటి వేయడంతో విద్యార్థులు కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.సుమారు 30మంది నర్సింగ్ విద్యార్థులను బయటకుపంపినారు.వివరాలు అడిగే సరికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఫీజు రీయింబర్స్ నిధులు లేటు అవుతున్నాయని అందువలన విద్యార్థులు తమ సొంత డబ్బులు కట్టి చదువుకోవాలని యాజమాన్యం కోరుతున్నారు. నర్సింగ్ ఆఖరి సంవత్సరం కట్టలేదని విద్యార్థులపై దౌర్జన్యం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ నిధులు చెల్లించకపోవడంతో నర్సింగ్ కళాశాల నుంచి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బయటకు పంపినారు.ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల నుంచి ఈ కళాశాలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని,కందుకూరు కాకినాడ,శ్రీకాకుళం,హైదరాబాద్, ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు.ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్( స్క్రలర్ షిప్) నిధులు లేట్ అవుతున్నాయని మీ సొంత నిధులు కట్టాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థులు మాత్రం తాము పేద మధ్య తరగతి ప్రజలమని ఫీజు రీయింబర్స్ నిధులు పై ఆధారపడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలుతో చెలగాటం ఆడుతున్నారు విద్యార్థులు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Amaravathi Jyothi