Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రజా ప్రతినిధులు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెం మండలంలో పోలినేనిపాలెం సచివాలయం నందు మా నమ్మకం నువ్వే జగనన్న ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఎంపీడీవో రఫిక్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. అనుమోలు అమరేశ్వరి యం పి టి సి సభ్యులు చింతలపూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి, పోనుగోటి మౌనిక వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి, పాల్గొన్నారు. ఈ సందర్బంగా సచివాలయం పరిధిలో సీఎం జగనన్న ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఎంత లబ్ది పొందింది వారికి తెలియజేసేలా సంక్షేమ పథకం బోర్డు ను ఆవిష్కరించారు. కార్యక్రమం అనంతరం వైసీపీ నాయకులు సచివాలయం నుండి బస్టాండ్ వరకు జై జగన్ -జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీ గా వచ్చి బస్టాండ్ కూడలిలో ఉన్న వైసీపీ జండాను ఆవిష్కరించారు అనంతరం సంక్షేమపథకాల బుక్ లెట్ ల ను ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమంలో జే సి ఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు , మండల సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు పొడపాటి ప్రేమ్ చంద్ గురుజాల కిష్టయ్య గడ్డం మాధవరావు నవులూరి హజరత్తయ్య చెన్నెబోయిన శ్రీను యాళ్ళ శివకుమార్ రెడ్డి సర్పంచ్ ఇరుపని సతీష్ దామా వెంకటేశ్వర్లు సర్పంచ్ వింజం వెంకటేశ్వర్లు అనుమెలు వెంకటస్వామి కొల్లూరి గోవింద్ మద్దాళిరామారావు స్థానిక గ్రామ నాయకుడు అనుమెలు సుబ్బారావు సచివాలయకన్వీనర్లు,గృహసారధులు,వలంటీర్లు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi