Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *జగన్నాథ రథయాత్ర.... జనసముద్రంగా మారిన కావలి* కావలి,అమరావతి జ్యోతి 16; కావలి పట్టణం నందు ఆర్.ఎస్.ఆర్ కళ్యాణం మండపం ఎదురుగా 8వ శ్రీ శ్రీ గౌర నితాయ్ (కృష్ణ- బలరామ్) రథయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు.వీరు ఆ జగన్నాథుడికి ముందుగా గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టి జండా ఊపి ప్రారంభించడం జరిగింది.ఈ జగన్నాథ రథయాత్ర ప్రారంభము నుండి రోడ్లన్నీ నీళ్లతో శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో.. మహిళలు కోలాటాలతో, డప్పు వైద్యులతో కళాకారులు వివిధి వేషాలలో, సాంస్కృతి కార్యక్రమాలతో, కావలి పట్టణం జన సముద్రముగా మారి జగన్నాథుడు పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణ పురవీధుల్లో జగన్నాథుడు రధం వెంబడి భక్తులు హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే నామముతో పలకడం జరిగింది. ఇస్కాన్ కమిటీ సభ్యులు ఆ జగన్నాథుడు రథం వెంబడి భక్తులకు ప్రసాద0 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
Admin
Amaravathi Jyothi