Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయంలోఘనంగా నిర్వహించారు. శ్రీ. సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగవాన్. శ్రీ సత్యసాయి బాబా ప్రేమ, శాంతి, మానవత, సేవ వంటి విలువలను ఆచరణలో చూపిన మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్నారన్నారు. స్వామి స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా నేటికీ విద్య, వైద్యం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందుతున్నాయని చెప్పారు. తన సేవ,బోధనలతో దైవ సమానులుగా భక్తుల హృదయాల్లో సత్యసాయిబాబా పదిలంగా నిలిచిపోయారన్నారు. బాబాను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి గ్రామ టిడిపి అధ్యక్షులు గుడ్లూరు బీఎస్సీ చైర్మన్ దామా వెంకటేశ్వర్లు మండల టిడిపి నాయకులు పాలకుర్తి బ్రహ్మయ్య జాతీయ జెండా మహేష్ మండల బిజెపి అధ్యక్షుడు ఇన్నమూరి సుధాకర్ మీ సేవ నిర్వాహకులు ఉండేల హరిప్రసాద్ ఎంపీడీవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి , రెవెన్యూ సిబ్బంది పులిపాటి రామయ్య
Admin
Amaravathi Jyothi