Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మిఛాంగ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - కోటపాటి జనార్దన్ రావు కందుకూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లాలో మిఛాంగ్ తుఫాను ప్రభావం అధికంగా ఉండటం వల్ల కందుకూరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు డిసెంబర్ 6 తేదీ (3రోజులు) వరకు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని , లోతట్టు ప్రాంతాలైన గుడ్లూరు మండలం , ఉలవపాడు మండలం ప్రజలు మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపాటి జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మిఛాంగ్ తుఫాను కారణంగా కందుకూరు నియోజకవర్గంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావసు కేంద్రాలకు తరలించి భోజనం వసతితోపాటు అవసరమైతే మెడికల్ సదుపాయం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను *కోటపాటి* కోరారు..
Admin
Amaravathi Jyothi