Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : నేను చేయాల్సింది చేశా.. ఇక మీ చేతుల్లోనే: జగన్ గుంటూరు, అమరావతి జ్యోతి: నవరత్న పథకాలు, పరిపాలన ద్వారా తాను ప్రజలకు చేయాల్సిందంతా చేశానని సీఎం జగన్ తెలిపారు. 'ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని ఆయుధాలను మీకు(అభ్యర్థులు) ఇచ్చా. ముందుకు తీసుకెళ్లి.. ఎన్నికల్లో గెలిచి రావాలి. ఇకపై మీరు చేసే పనులపైనే మీ విజయం ఆధారపడి ఉంది. ఈసారి నాకు 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీలు రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లండి' అని శ్రేణులకు సూచించారు.
Admin
Amaravathi Jyothi