Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పొగకు క్యూరింగ్ గ్రేడింగ్ పరిశీలించిన చిడిపోతు యశ్వంత్ వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి: పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం గుంటూరు నుంచి పొగాకు బోర్డు చైర్మన్ చిదిపోతు యశ్వంత్ 26 వ వేలం కేంద్రo మరియు 27 వ వేలం కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పొగాకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.అలాగే రైతులు పండించిన పొగాకును బోర్డు లోనే అమ్ముకోవాలని తెలిపారు.బయట దళారులకు పొగాకు విక్రయించవదని సూచించారు. తదనంతరం వారు పోన్నలూరు, దూబగుంట గ్రామాలు మరియు 27 వ వేలం కేంద్రం లోని శాఖవరం, VR కోట గ్రామాలలో పొగాకు క్యురింగ్ లు, గ్రేడింగ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. బ్యారన్ లో అల్లిన కర్రలను మోతాదు కి మించి పెట్టకూడదు కురోమెటర్ ని తప్పని సరిగా వాడాలని దీని వలన అగ్ని ప్రమాదాలను నివారిచేందుకు అవకాశం ఉందని అన్నారు. గ్రేడు చేసేటపుడు పోగాకేతర పదార్థాలను వేరు చేయలని తెలిపారు.రైతు సోదరులు వేలం కేంద్రం వెలుపల అమ్మడం కొనడం నేరం అని తెలిపారు. అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వేలం నిర్వహణాదికారులు రామ్ మీనా, రాజగోపాల్ , పొగాకు బోర్డు సిబ్బంది మరియు 26, 27 వ వేలం కేంద్రం పొగాకు రైతులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi