Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం మండలంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ టిడిపిలో చేరిన వాకమళ్లవారిపాలెం నేతలు వేమిరెడ్డి, ఇంటూరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి లింగసముద్రం, అమరావతి జ్యోతి: లింగసముద్రం మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది. లింగసముద్రం పంచాయతీ వాకమకళ్లవారిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి సోదరులు పెద్దఎత్తున అధికారపార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం టిడిపిలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన వైసిపి ముఖ్యనేత ఉప్పతి బాబురెడ్డితో పాటు ఆయన ఆధ్వర్యంలో మునగాల నారపరెడ్డి, మన్నెం బసిరెడ్డి, అంబవరపు గోపాల్రెడ్డి, మన్నెం ఆదినారాయణరెడ్డి, కొరివి ఆదినారాయణరెడ్డి, అంబవరపు లక్ష్మీనారాయణ, సిద్ధమూర్తి సుధాకర్, రామచంద్రయ్య, మన్నెం మాల్యాద్రి, మాలకొండయ్య కొరివి శ్రీనివాసులురెడ్డి, వెంకట్రాములు, పోకల కొండయ్య, అశోక్ కుమార్, మన్నెం వెంకటేశ్వర్లు, పుల్లయ్య, పంగా వెంకటనరసయ్య, బైరెడ్డి బ్రహ్మారెడ్డి, అంబవరపు మాలకొండయ్య సహా 30కి పైగా కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, త్వరలో మరికొన్ని కుటుంబాలు టిడిపిలో చేరబోతున్నాయని తెలిపారు.
Admin
Amaravathi Jyothi