Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : యువ గళం ముగింపు సభను విజయవంతం చేయండి - జగన్ రెడ్డికి బుద్ది చెప్పండి.- బెజవాడ ప్రసాద్, కందుకూరు, అమరావతి జ్యోతి: ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాలీగా వున్న 2.30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్ రెడ్డికి బుద్ది చెప్పేలా ఈ నెల 20 వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురం మండలం, పోలిపల్లి భూమాత లేఔట్ నందు జరగనున్న యువగళం - నవశకం పేర నిర్వహించనున్న బారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ పిలుపునిచ్చారు, ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ జగన్ రెడ్డి మాట మాటలు నమ్మి గడిచిన 5 సంవత్సరాలలో యువత మోసపోయారని వారి అభివృద్దే లక్ష్యంగా రానున్న తెదేపా ప్రభుత్వం లో 20లక్షలు ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, లోకేష్ మద్దతుగా వుండేలా యువ గళం ముగింపు సభకు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలి వచ్చి యువత మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొనే యువ గళం పాదయాత్ర ముగింపు సభకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు యువత, విద్యార్ధులు యువగళం ముగింపు సభలో పాల్గొనాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ పిలుపు నిచ్చారు.
Admin
Amaravathi Jyothi