Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఘనంగా నివాళులు... కందుకూరు: కందుకూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మానుగుంట ఆదినారాయణ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన మాచవరంలో ఆ మహనీయుని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆయన తనయుడు ,మాజీ మంత్రి వర్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి కందుకూరు ప్రాంతానికి ఆనాటి కాలంలో చేసిన సేవలను, అభివృద్ది పనులను ఆయన శ్రేయోభిలాషులు గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది వైకాపా కార్యకర్తలు, ఆదిరెడ్డి అభిమానులు, మహీధర రెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొని స్వర్గీయ మానుగుంట ఆది నారాయణ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.
Admin
Amaravathi Jyothi