Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,అమరావతి జ్యోతి :14వ వార్డు తూర్పు వడ్డేపాలెం, తూర్పు కమ్మ పాలెం, బీసీ కాలనీలో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొడపాటి శివకుమార్(చక్రి) ప్రచారం నిర్వహించారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే తనను సంప్రదించవచ్చు అని స్థానికులుతో చక్రి చెప్పారు. కొంత మంది స్త్రీలు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదివారు, ఉద్యోగ అవకాశాలు చూపమని అడగగా, తప్పకుండా వారి ఉద్యోగ ప్రయత్నాలలో దిక్సూచిగా నిలుస్తానని చక్రి తెలిపి తన ఫోన్ నంబర్ ఇచ్చారు. ప్రతి వ్యక్తి విద్యావంతులై, ఉపాది చేసుకుంటూ ప్రజలే ప్రభుత్వాలకి పన్నులు కట్టాలి కానీ ఉచితాల కోసం ఆశించకూడదని మరియు ఓటుకి నోటు తీసుకోవడం వల్ల మీరు నాయకులను ప్రశ్నించే హక్కు కోల్పోతారని అక్కడి స్థానికులకు చక్రి వివరించారు. మార్పు కోసం బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చక్రి స్థానికులను కోరారు.
Admin
Amaravathi Jyothi