Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తెలుగుదేశం పార్టీతోనే భద్రత, భవిష్యత్తు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించండి అధికారంలోకి రాగానే మినీమేనిఫెస్టోను కచ్చితంగా అమలుచేస్తాం 24వ వార్డులో ఇంటూరి ఇంటింటి ప్రచారం కందుకూరు, అమరావతి జ్యోతి: బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు.కందుకూరు పట్టణంలోని 24వ వార్డు వెంకటేశ్వర నగర్, గుండంకట్ట ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మ్యానిఫెస్టోపై కరపత్రాలు పంచుతూ, ఇంటింటి ప్రచారం నిర్వహించిన నాగేశ్వరరావు, పార్టీ నేతలు.స్థానికుల సమస్యలు తెలుసుకొని, కొన్నిటిపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడిన నాగేశ్వరరావు.ప్రభుత్వ పథకాలు సరిగా అందకపోవటం, పింఛన్లు నిలిపివేయడం, జిప్లస్ త్రీ ఇళ్ల జాబితాలో నుంచి పేర్లు తొలగించడంపై నాగేశ్వరరావుకు విన్నవించిన స్థానిక మహిళలు నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు సముచిత స్థానం దక్కిందని, జగన్ ప్రభుత్వంలో మాటలు తప్ప ఏమి చేయలేదని విమర్శించారు. పనికిరాని కార్పొరేషన్ల ఏర్పాటువల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే పథకాలు ఎందుకు నిలిపేశారో, వైసీపీ నేతలను నిలదీయాలని నాగేశ్వరరావు సూచించారు. కందుకూరులో వైసిపి నేతలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. వాగులను, చెరువులను ఇష్టం వచ్చినట్లు తవ్వేసి డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. అదంతా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కనుసనల్లోనే జరుగుతున్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే హామీ ఇచ్చిన బైపాస్ రోడ్డు, మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాంట్ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమయ్యాయని నాగేశ్వరరావు నిలదీశారు. జగనన్న కాలనీలో ఇళ్లు ఎంత క్వాలిటీతో కడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆ లబ్ధిదారులంతా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని నాగేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే భద్రత, భవిష్యత్తు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని నాగేశ్వరరావు కోరారు. అంతకుముందు పామూరు రోడ్డు లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమములో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రదానకార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డుఅధ్యక్షుడు మధిర మధు, వార్డు నాయకులు లంకేనపల్లి బాలబ్రహ్మచారి, శ్రీపతి మురళీకృష్ణ,షేక్ బాజీ, మాధవరం సుబ్బయ్య, మణి,షేక్ ఖాజావలి, మధిర వెంకటేశ్వర్లు, షేక్ పెద్ద మస్తాన్, .సుబ్బారావు, గుర్రం శ్రీకాంత్, వీరబ్రహ్మం,షేక్ సుభాని, శ్రీను, మన్నం నరసింహ నాయకులు నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, షేక్ మున్నా, చుండూరి శీను, షేక్ సలాం, సయ్యద్ జియావుద్దీన్, ఫిరోజ్, గౌస్ బాషా, కరిముల్లా, ముచ్చు వేణు, పులి నాగరాజు, ఫాజిల్, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్, ముప్పవరపు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi