Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం తోనే సాధ్యం : ఎమ్మెల్యే స్వామి కొండపి,అమరావతి జ్యోతి : ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందించే ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలంలోని కట్టవారపాలెం గ్రామానికి చెందిన వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ తో పాటు మరో 10 కుటుంబాలు ఎమ్మెల్యే స్వామి సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండవాలు కప్పి తెలుగుదేశం లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రజల్లో విశ్వాస కోల్పోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ముసుగులో దోపిడీకి దౌర్జన్లకు దిగబడ్డారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రతి ఒక్కరికి బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుంచాల ప్రసాద్, తన్నీరు లక్ష్మయ్య, తన్నీరు హరికృష్ణ తోపాటు మరో 10 కుటుంబాలు వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi