Wednesday, 22 April 2026 07:15:19 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అమరజీవికి నివాళులర్పించిన వైసీపీ నేతలు

Date : 16 December 2024 06:56 AM Views : 802

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన అమర జీవికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు. కందుకూరు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు,ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమర జీవి శ్రీపొట్టి శ్రీరాములు 42వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.అమర జీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీనేతలు మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రంగా ఉండాలని నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు శ్రీపొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్రులు ఆరంభసూరులనే నానుడని చెరిపి వేస్తూ ఆత్మార్పణ చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణను సాకారం చేసిన త్యాగజీవి శ్రీపొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన త్యాగఫలమే నేడు తెలుగు జాతి అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలని కొనియాడారు. అమరజీవి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లీ సమాజ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్,వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రావులకొల్లు బ్రహ్మానందం,గణేశం.గంగిరెడ్డి,పాశం కొండయ్య,రేణమాల.అయ్యన్న, వల్లూరి.కోటేశ్వరరావు,షేక్.రహీం, కూరపాటి వెంకట్రామిరెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, ద్రోణాదుల చైతన్య, షేక్.రిజ్వాన్, జంగిలి.ఇశ్రాయేలు, కొచ్చర్ల.మాల్యాద్రి, శ్రీరామ కుమారస్వామి,ఎస్కే సుల్తాన్, కే.సుబ్బారావు, వెంకటేశ్వర్లు,షేక్ అబ్దుల్ కలాం,జి. ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :