Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన అమర జీవికి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు. కందుకూరు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు,ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమర జీవి శ్రీపొట్టి శ్రీరాములు 42వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.అమర జీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీనేతలు మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే ప్రాంతంలో ఒక రాష్ట్రంగా ఉండాలని నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప మహానుభావుడు శ్రీపొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్రులు ఆరంభసూరులనే నానుడని చెరిపి వేస్తూ ఆత్మార్పణ చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణను సాకారం చేసిన త్యాగజీవి శ్రీపొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన త్యాగఫలమే నేడు తెలుగు జాతి అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలని కొనియాడారు. అమరజీవి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లీ సమాజ అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్,వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రావులకొల్లు బ్రహ్మానందం,గణేశం.గంగిరెడ్డి,పాశం కొండయ్య,రేణమాల.అయ్యన్న, వల్లూరి.కోటేశ్వరరావు,షేక్.రహీం, కూరపాటి వెంకట్రామిరెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, ద్రోణాదుల చైతన్య, షేక్.రిజ్వాన్, జంగిలి.ఇశ్రాయేలు, కొచ్చర్ల.మాల్యాద్రి, శ్రీరామ కుమారస్వామి,ఎస్కే సుల్తాన్, కే.సుబ్బారావు, వెంకటేశ్వర్లు,షేక్ అబ్దుల్ కలాం,జి. ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi