Monday, 01 December 2025 05:48:07 AM
# భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్. # ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు # ఎమ్మెల్యే ఇంటూరి చొరవతో ముమ్మరంగా డివైడర్ నిర్మాణ పనులు # కోటి సంతకాల సేకరణ పై మండలం నాయకులతో సమీక్షించిన బుర్రా # 108 హనుమాన్ చాలీసా లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి # లింగసముద్రంలో ప్రజాదర్బార్ ప్రజలను పదేపదే తిప్పుకోకుండా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ఇంటూరి # ఒకటైన యువ ఐఏఎస్ లు # ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి # నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇంటూరి సౌజన్య # గుడ్లూరులో ఎమ్మెల్యే సతీమణి ఇంటూరి సౌజన్యకు ఘనసన్మానం # డ్వామా పిడి చేపట్టిన వివిధ రకాల నీటి సంరక్షణ చర్యలతో నెల్లూరు జిల్లాకు అవార్డు # వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

విమానం ల్యాండింగ్ పై మాట్లాడిన ఎంపీ మాగుంట

Date : 13 December 2023 09:46 PM Views : 303

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : శింగరాయకొండ వద్దనున్న విమాన లాండింగ్ పూర్తిపై పార్లమెంటులో మాట్లాడిన మాగుంట ఒంగోలు, అమరావతి జ్యోతి: పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి రూలు - 377 క్రింద మాట్లాడుచూ దేశంలో ప్రకృతి వైపరిత్యాలు మరియు కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులు సంభవించినపుడు విమానాలు దిగుటకు ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటుచేసే క్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో చిలకలూరిపేట – నెల్లూరు సెక్షన్ లో శింగరాయకొండ వద్ద కూడా 3.60 కి. మీ. మేర ఒకటి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాన మంత్రికి మరియు కేంద్ర రోడ్డు - హైవేల శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ లాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ మరియు కాంట్రాక్టర్ మధ్య 26-12-2019 అగ్రీమెంటు జరిగి, ప్రధాన సివిల్ పనులు 20-12-2021 నాటికి పూర్తయినవి. 28-07-2021 తేదీన భారత విమాన సంస్థ మరియు నేషనల్ హైవే అథారిటీ వారు జరిపిన జాయింటు ఇన్స్పెక్షనులో మైనర్ బెండ్స్ (చిన్న వంకలు) మరియు కర్వ్ (మలుపు) లను గుర్తించారు. ప్రాజెక్టు డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ, నెల్లూరు, విమాన సంస్థ, కాంట్రాక్టర్లు మరియు సలహాదారులు జరిపిన జాయింటు తనిఖీలో చిన్న వంకలును మరియు మలుపును వాటిని నిటారుగుగా వేయుటకు గల అవకాశాలను అన్వేషించడం కూడా జరిగింది. తదుపరి, సదరు పనులకు మరియు భూ సేకరణకు రూ.26.60 కోట్లు అంచనాతో విజయవాడలోని నేషనల్ హైవే అథారిటీ రీజినల్ ఆఫీసరు ఆమోదానికి 25-01-2023 న పంపడంకూడా జరిగింది. 11 నెలల గడచినను మరియు త్వరితగతిన పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చినను, సదరు పని ఇప్పటికీ పెండింగులోనే వున్నది. కనుక, ఈ పనికి అత్యధిక ప్రాదాన్యతనిచ్చి, అంచనాను వెంటనే ఆమోదించి జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రిని మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరినారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2025. All right Reserved.



Developed By :