Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంటూరి రాజేష్ కందుకూరు, అమరావతి జ్యోతి: వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, కందుకూరుకు చెందిన ఇంటూరి రాజేష్ ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆయన నివాసానికి చేరుకున్న నాయకులు వేమిరెడ్డిని పుష్పగుచ్ఛం, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులందరితో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డి వెంట తామందరం నడుస్తామని స్పష్టం చేశారు. వేమిరెడ్డితో ఇంటూరి రాజేష్ , దివి రమేష్ పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు దివి రమేష్, పొడపాటి శ్రీను, బసవయ్య నాయుడు, రమేష్, వంశీ, వెంకయ్య, జియాజుద్దీన్, కరిముల్లా, పలువురు మహిళా నాయకురాళ్లు తదితరులు ఉన్నారు. ఇంటూరి రాజేష్ ఆధ్వర్యంలో భారీగా నెల్లూరు బయలుదేరి వెళ్లారు.
Admin
Amaravathi Jyothi