Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా పారిశ్రామిక వేత్తలకు వారధిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమెరికా పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారధిగా నిలుస్తున్నారు. అమెరికా పారిశ్రామిక వేత్తలతో ఉన్న సంబంధాలను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అనుసంధానం చేస్తూ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నందు అమెరికా పారిశ్రామిక వేత్తలైన విమల్ కుమార్ కొలప్ప శ్రీ సాయి కిరణ్ కొలవెన్ను, లను పరిచయం చేశారు. ఎన్నారై పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తొలి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆగ్రో ఫామ్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ, మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుటకు అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రతినిధులతో పాటు ఉదయగిరి ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.
Admin
Amaravathi Jyothi