Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు ఆనందపురం గ్రామంలో 3 రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేసినా సరైన స్పందన లేకపోవడంతో గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల అవస్థలు తెలుసుకున్న కందుకూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వెంటనే స్పందించి టాంకర్ ద్వారా నీటి సరఫరా చేయించారు. సమస్య ఎప్పుడు వచ్చినా తమకు సమాచారం అందిస్తే, సహకారం అందిస్తానని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాగేశ్వరావుకి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Amaravathi Jyothi