Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బోగోలు వైసీపీ కి షాక్ -వార్డు మెంబర్ తో పాటు ముఖ్య నాయకులు టీడీపీలో చేరిక కావలి,అమరావతి జ్యోతి: బోగోలు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. వైసీపీ కి చెందిన బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ కడనూతల గ్రామానికి చెందిన 8వ వార్డు మెంబర్ దాసరి శ్రీనివాసులు, నక్క పుల్లయ్య ఉమామహేశ్వర పురం కు చెందిన పంట దర్గా బాబు, తదితర ముఖ్య నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరికి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.. బోగోలు మండలంలో వరుసగా టీడీపీ లోకి వస్తున్న చేరికలతో వైసీపీ డీలా పడింది.. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎల్. సుధీర్, తెలుగు యువత నాయకులు పైడి హర్ష, సన్నిగంటి వేణు నక్క శ్రీనివాసులు, గరటాల సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi