Amaravathi Jyothi - Andhra Pradesh / అమరావతి : తొలి మాట అదుర్స్. రైతాంగం శ్రేయస్సు కోసం. రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇంటూరి సోమశిల ఉత్తర కాలువ వెడల్పు, రాళ్లపాడు ఎడమ కాలువ పనులు ప్రారంభించాలి. చంద్రబాబు, లోకేష్ తో పాటు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి కందుకూరు, అమరావతి జ్యోతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో కందుకూరు ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యలపై తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ప్రజల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల ప్రాజెక్టు నుంచి గొట్టిపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ ద్వారా 1.5 టీఎంసీలు నీరు రాళ్లపాడు ప్రాజెక్టుకు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ కాలువలో నీటిపారుదల సరిగా లేక 0.5 టిఎంసి నీరు మాత్రమే ప్రాజెక్ట్ చేరటం ద్వారా పూర్తిస్థాయిలో నీరు రాక కందుకూరు నియోజకవర్గం రైతాంగం పంటలు పండించేందుకు ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు..రాళ్లపాడు ప్రాజెక్టు సంబంధించిన 2018 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా స్వగ్రామమైన బడేవారిపాలెం పర్యటనలో రాళ్లపాడు ఎడమ కాలువ పనులకు సంబంధించిన జీవో నెంబర్ 116 ద్వారా ఎడమకాలువ పనులు ప్రారంభమయ్యేలాచర్యలు తీసుకున్నారు.. ఈ ఎడమ కాలువ పనులు పూర్తి అయితే వలేటివారిపాలెం మండలం లింగసముద్రం మండలంలోని వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు.. కానీ గత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులపై ఎటువంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టును డిప్ ఇరిగేషన్ పథకంలో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.. కానీ గత ప్రభుత్వంలో ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులను ఇంటూరి నాగేశ్వరరావు కోరారు.. ముందుగా తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి, యువ నాయకులు నారా లోకేష్ కి మరియు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు..
Admin
Amaravathi Jyothi