Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంగలకుదురులో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి స్టిక్కర్ ఆవిష్కరించిన చిదంబర శాస్త్రి గుడ్లూరు: అంగలకుదురు ఆశ్రమంలో శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా ఘనంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్టిక్కర్ ఆవిష్కరణ కార్యక్రమం వాసుదాస స్వామి వారి పరంపరపీఠం అంగలకుదురులో (దాసకుటి) ఆశ్రమంలో నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామ బస్టాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి మూలవిరాట్ విగ్రహ స్టిక్కర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో స్వామివారికి యంత్ర సమర్పణ చేసిన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్టిక్కర్ను భక్తుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. స్టిక్కర్ ఆవిష్కరణతో పాటు శ్రీరామానంద్ బిరుదాంకితులు పంగులూరి గోవిందరావుపై వారి శిష్యురాలు ఇందిర రచించిన పుస్తకాన్ని కూడా అన్నదానం చిదంబర శాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అంగలకుదురు ఆశ్రమ ఆరవ పీఠాధిపతి ఉలిచి సీతారామ శర్మ (పట్టాభి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభి, గోవిందరావు, చిదంబర శాస్త్రి భక్తులను ఉద్దేశించి, శ్రీరామ్ శరణ్ గురుదేవుల గురించి వివరించారు. ట్రస్ట్ అధ్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావు మాట్లాడుతూ 108 కోట్ల శ్రీరామనామ తారక మహామంత్ర జపంతో పాటు, ఐదు కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో 50శాతం పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. ఆలయ నిర్మాణం అన్నదానం చిదంబర శాస్త్రి సలహా సూచనలు మేరకు నిర్మిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు , చీరాల ప్రసాద్ , శ్రీలత, ఇందిర, టి శరత్ రెడ్డి,గోవింద రావు శిష్య బృందం పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు హనుమంతరావు, చిదంబర శాస్త్రి తో పాటు పట్టాభి, గోవిందరావుని శ్రీరామనామం, ఆంజనేయ నామంతో ఉన్న శాలువాతో సత్కరించారు.
Admin
Amaravathi Jyothi