Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన ఘనుడు జగన్ రెడ్డి. - బెజవాడ ప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కందుకూరు, అమరావతి జ్యోతి: అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో గద్దె నెక్కిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువతను మోసం చేశారని, కనీసం ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నట్టేట ముంచారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ ఆరోపించారు, గత టీడీపీ పాలనలో రెండు సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 18 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెదేపా దని, అలాగే SC,ST,BC, మైనారిటీ, బ్రాహ్మణ కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ కింద రుణాలను మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పించారని, ఈ జగన్ రేడ్డి ప్రభుత్వం ఒక్క రుపాయి కూడా ఇవ్వకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే వందలకొద్దీ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి యువతకు స్వయం ఉపాధి కల్పించ లేక పోయారని అన్నారు, ఈ ఐదు సంవత్సరాల కాలంలో డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలని చేసి యువత జీవితాలను నాశనం చేశారని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత నాలుగేళ్లలో 21,571 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారనీ, వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గద్దె దింపాలని నిరుద్యోగ యువతకు బెజవాడ ప్రసాద్ పిలుపునిచ్చారు, జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదంతో వైసీపీ పార్టీ ని అంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో బుస్తాపితం చేస్తామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ హెచ్చరించారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలమేరకు సోమవారం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు, బుధ వారం యువత ను మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్ రెడ్డి పై అన్ని నియోజక వర్గాల్లో పోలీసు స్టేషన్ లలో కేసు నమోదు చేసి నిరసన, శుక్రవారం యువజన దినోత్సవం రోజు స్వామి వివేకానంద, అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమములు చేపడుతున్నట్లు, వాటిలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బెజవాడ ప్రసాద్ యువతకు విజ్ఞప్తి చేశారు.
Admin
Amaravathi Jyothi