Monday, 20 April 2026 06:51:54 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్‌

అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది

Date : 28 February 2025 05:17 PM Views : 798

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన 2025-26 పూర్తిస్థాయి బడ్జెట్‌ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా రూ.3.22 లక్షల కోట్లతో అభివృద్ధి,సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు భారీ కేటాయింపులు చేయడం సంతోషదగ్గ విషయమన్నారు. వ్యవసాయశాఖ బడ్జెట్‌ రూ.48,340 కోట్లు కేటాయించడం ద్వారా ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించిందన్నారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన నెల్లూరు జిల్లాలో లక్షలాదిమంది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు అధిక కేటాయింపులు చేయడం హర్షించదగ్గ విషయమని ప్రస్తావించారు. బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో 23,260 కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారని, ఆరోగ్యశాఖకు రూ.19,265 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు, పురపాలన శాఖకు బడ్జెట్‍లో రూ.13,862 కోట్లతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని కొనియాడారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :