Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : క్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం. - మాజీ శాసనసభ్యులు కందుల. తర్లుపాడు.అమరావతి జ్యోతి: శాంతి కరుణ సహనం ప్రేమలని ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని మార్కాపురం టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ రోజు సందర్భంగా తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం, కేతగుడిపి, తర్లుపాడు గ్రామాల్లోని చర్చిలను సందర్శించి క్రిస్టియన్ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రమైన తర్లుపాడు ఎస్సీ కాలనీలోని రెండు చర్చలలో సంతోషాల మధ్య క్రిస్మస్ పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా, రెవరెండ్.డా. ఎం.ఎస్.విజయ్ కుమార్, రెవరెండ్. కందుల రవి ల ఆధ్వర్యంలో దేవునికి మహిమ కరంగా జరిగాయి.క్రిస్మస్ సందర్భంగా చర్చి వారందరికీ, గ్రామస్తులకు శుభములు తెలియజేయడ నిమిత్తం విచ్చేసిన కందుల నారాయణరెడ్డి ప్రజలకు క్రిస్మస్ ను సంతోషాలతో జరుపుకోవాలని, అందరూ ఐక్యతతో జరుపుకోవాలన్నారు. కరుణామయుడు జీసస్ జన్మదిన క్రిస్మస్ మానవులందరికీ పండగ రోజు అని జీసస్ ప్రవచించినట్లుగా ప్రతి ఒక్కరు ఎదుటివారి పట్ల కరుణ, జాలి, దయతో ఉండాలని, క్షమాగుణం అలవర్చుకోవాలని, నిరంతరం సేవానిరతితో మెలగాలని తద్వారా మానవాళి శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెండు చర్చ్ ల సంఘ కాపరులు మాట్లాడుతూ క్రిస్మస్ అనగా ప్రేమ,సంతోషము,సమాధానమని తెలియజేశారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తనను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తారని, కాపాడుతాడని, రక్షణ ఇస్తాడని, బోధించారు. మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డిని మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రార్థించి, ఆశీర్వదించారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు నారాయణరెడ్డి కేక్ కట్ చేసి సంఘ కాపరికి, పెద్దలకు కేకును పంచిపెట్టారు. కూడిక అనంతరం అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆటలు పోటీలు జరగక సంఘ కాపరి రెవ.డా. విజయకుమార్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మండల టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi