Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *కోటి సంతకాల సేకరణలో లక్ష్యం చేరుకుంటాం.* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు పట్టణ మరియు మండలాల నాయకులు,కార్యకర్తలుతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను సమీక్షించి మండల పట్టణ నాయకులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం దారాదత్తం చేయటాన్ని నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు కార్యక్రమంలో పాల్గొంటున్న వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఇంట్లెక్చువల్ కార్యదర్శిగా ఎన్నికైన కాకర్ల రాజగోపాల్ ఇంచార్జి బుర్రా మధుసూదన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా బుర్రా అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi