Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *వైఎస్సార్ సీపీ నేత చల్లాకు ఘన సత్కారం* ఆలమూరు, అమరావతి జ్యోతి : ఆలమూరుకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, డాక్టర్ చల్లా ప్రభాకరరావు మండపేట నియోజవర్గ పరిశీలకులుగా భాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం మండపేటలో జరిగిన వైఎస్సార్ సీపీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని కోరారు. నియోజక ఇన్చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తద్వారా మండపేట నియోజవర్గ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండపేట లో టీడీపీ కోటను బద్దలు కొట్టి ఎమ్మెల్సీ త్రిమూర్తులను ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం జగన్ కు బహుమతిగా ఇద్దామన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు, మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
Admin
Amaravathi Jyothi