Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉదయగిరి నియోజకవర్గంలో ఆగ్రో ఫామ్స్ ఏర్పాటుకై అమెరికా పారిశ్రామికవేత్తలు, పలు ప్రాంతాలు పరిశీలన. పారిశ్రామికవేత్తలతో కలసి కామదేను ప్రాజెక్ట్, మరియు పలు పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఆగ్రో ఫామ్స్ కు అనువైన ప్రాంతంగా గుర్తించిన పారిశ్రామికవేత్తలు,విమల్ కుమార్ కొలప్ప, సాయి కిరణ్ కొలవెన్ను కొండాపురం, కలిగిరి: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపుమేరకు అమెరికాలోని ర్యాలై, నార్త్ కరోలినా, ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు విమల్ కుమార్ కొలప్ప, సాయి కిరణ్ కొలవెన్ను, పెట్టుబడులు పెట్టేందుకు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మరియు నాయకులతో కలిసి ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం మండలం మరియు కలిగిరి మండలాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయానికి అనుకూలమైన ఈ ప్రాంతంలో ఆగ్రో ఫామ్స్ ఏర్పాటు చేసేందుకై కొండాపురం మండలం చింతల దేవిలోని కామధేను ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం అదే మండలంలో జంగాలపల్లి గ్రామంలో మెట్ట పంటలైన పొగాకును పరిశీలించారు. రైతులతో కలిసి మాట్లాడారు. అనంతరం కలిగిరి మండలం కమ్మవారిపాలెం లో షీప్ ఫార్మ్ లోని జీవాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయానికి అనువైన ప్రాంతంగా గుర్తించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. మెట్ట ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం అని సీనియర్ సిటిజన్లు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Amaravathi Jyothi