Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సుందరయ్య నగర్ వాసుల దాహార్తి తీర్చిన ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి:: కందుకూరు పట్టణంలోని సుందరయ్య నగర్ వాసులు గత నాలుగు రోజులుగా సుందరయ్య నగర్ కు తాగునీటి సరఫరా చేయడం లేదని,అనేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు నాగేశ్వరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కనే నివసిస్తున్నా ఈ ప్రాంతానికి తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయలేదని వాపోయారు. దీనికి వెంటనే స్పందించిన నాగేశ్వరరావు, తన సొంత ఖర్చులతో ట్యాంకర్ ను తెప్పించి తాగునీటిని సరఫరా చేయించారు. దీంతో సుందరయ్య నగర్ వాసులు నాగేశ్వరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi