Saturday, 18 April 2026 02:40:06 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తొగటవీర క్షత్రియులు రాజకీయంగా రాణించాలి: కదిరి ఎమ్మెల్యే కందికుంట

Date : 24 November 2024 07:14 PM Views : 830

Amaravathi Jyothi - Andhra Pradesh / YSRkadapa : తొగటవీర క్షత్రియులు రాజకీయంగా రాణించాలి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కడప: తొగటవీర క్షత్రియులు ఒకరికొకరు ఐక్యంగా సమైక్యంగా పరస్పరం సహకరించుకుంటూ .రాజకీయంగా ఎదగాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కనుమలోపల్లిలోని 108 శివలింగాల మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కందికుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే నాయకత్వం కింద పని చేస్తే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాజకీయ పార్టీలు కూడా అలాంటి వారిని గుర్తించి పెద్దపీట వేస్తాయన్నారు. రాష్ట్రంలో తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అందులో జిల్లాకు చెందిన వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు కళ్యా సుధాకర్, పల్లా నరసింహారావులు మాట్లాడుతూ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. పిల్లలకు పెద్దలకు ఆటలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కాలమానిని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తొగట వీర క్షత్రియ సంఘం మహిళ అధ్యక్షురాలు సురువు శ్రీలత, రాయలసీమ అధ్యక్షులు బొమ్మల వెంకటరత్నం, జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, నగర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం ,కోశాధికారి టేకూరు సుదర్శన్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా మురళి కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు చౌడం సూరిబాబు, సుంకర రామచంద్రుడు, సంగీనాథం ఆంజనేయులు, గోవిందు నాగరాజు ,సిఆర్ఐ సునీల్ జయంత్, పల్లా బాలచౌడన్న, బొలిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :