Amaravathi Jyothi - Andhra Pradesh / YSRkadapa : తొగటవీర క్షత్రియులు రాజకీయంగా రాణించాలి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కడప: తొగటవీర క్షత్రియులు ఒకరికొకరు ఐక్యంగా సమైక్యంగా పరస్పరం సహకరించుకుంటూ .రాజకీయంగా ఎదగాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కనుమలోపల్లిలోని 108 శివలింగాల మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కందికుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే నాయకత్వం కింద పని చేస్తే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాజకీయ పార్టీలు కూడా అలాంటి వారిని గుర్తించి పెద్దపీట వేస్తాయన్నారు. రాష్ట్రంలో తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అందులో జిల్లాకు చెందిన వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు కళ్యా సుధాకర్, పల్లా నరసింహారావులు మాట్లాడుతూ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. పిల్లలకు పెద్దలకు ఆటలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కాలమానిని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తొగట వీర క్షత్రియ సంఘం మహిళ అధ్యక్షురాలు సురువు శ్రీలత, రాయలసీమ అధ్యక్షులు బొమ్మల వెంకటరత్నం, జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, నగర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం ,కోశాధికారి టేకూరు సుదర్శన్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా మురళి కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు చౌడం సూరిబాబు, సుంకర రామచంద్రుడు, సంగీనాథం ఆంజనేయులు, గోవిందు నాగరాజు ,సిఆర్ఐ సునీల్ జయంత్, పల్లా బాలచౌడన్న, బొలిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi