Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కొండపిలో వైసీపీ నుంచి టిడిపిలోకి కొండపి, అమరావతి జ్యోతి:: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందాయని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి నివాసంలో ఆదివారం కొండపికి చెందిన 10 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి స్వామి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానిస్తూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో రాజవరపు సుబ్బయ్య, ఆవుల శీన, వరిగ శ్రీదేవి తోపాటు వారికి చెందిన పది కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఆదరించారని, నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో లోపాల పుట్టాలని స్వామి ఆరోపించారు. మే 13 న జరిగే ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి నీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని స్వామి కోరారు.
Admin
Amaravathi Jyothi