Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఎస్మా జి ఓ ప్రతులు బోగిమంటల్లో దగ్ధం చేసి, పండగ రోజు కూడా శిబిరాల్లోనే అంగన్వాడిలు. ఉలవపాడు,అమరావతి జ్యోతి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, అయితే ఎస్మా కు ఏమాత్రం భయపడబోమని, సమ్మె శిబిరాల్లోనే భోగిమంటల్లో ఎస్మాప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను తెలిపారు. జగనన్నకు మనసు మారాలి -మా అంగన్వాడీల వేతనాలు పెంచాలి అంటూ ముగ్గులు వేసి వ్రాశారు. ఐసిడిఎస్ ఉలవపాడు ప్రాజెక్టు వద్ద 34 వ రోజులో భాగంగా భోగి పండుగనాడు అంగన్వాడీల సమ్మె శిబిరం కొనసాగింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ శిబిరంలో చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా నాయకులు జివిబి కుమార్ మాట్లాడుతూ సమ్మె పరిష్కారం కానట్లయితే సంక్రాంతి పండుగ అనంతరం సీఎం ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు చాలీచాలని వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటుందని వారికి కనీస వేతనాలు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలను చిన్నచూపు చూస్తుందని పేర్కొన్నారు. సమ్మె పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఉలవపాడు ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్ ఇందిరావతి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కత్తి బుజ్జమ్మ,కే. కోటేశ్వరి,డి. వెంకటరమణమ్మ, సుస్మిత,సునీత,మల్లేశ్వరి, వాయాల జానకి,కే.సుశీల, వి కృష్ణవేణి,బి.ఆదిలక్ష్మి,వి.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi