Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : సింగరాయకొండలో సైకిల్ హుషారు సింగరాయకొండ,అమరావతి జ్యోతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తధ్యమని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలం సోమరాజుపాలెం గ్రామానికి చెందిన అలహరి బాలాజీ, అలహరి సుబ్బారావు, గుండ్రేడ్డి శివ ప్రసాద్, శీలం లక్ష్మయ్య, శీలం వెంకట్రావు గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టిడిపిలో చేరగా వారికి శాసనసభ్యులు *డా|| డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* కండువా కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందని అందరూ సమానంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే స్వామి అన్నారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Admin
Amaravathi Jyothi