Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బోగోలు మండల కన్వీనర్ వీర రఘుకు షాక్ ఇచ్చిన వైసీపీ నేతలు టీడీపీ లో చేరిన వైసీపీ నేతలు కావలి, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు కమ్మపాలెం కి చెందిన వైసీపీ నాయకులు సోమవారం వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి,కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డి.తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు...గ్రామ 6వ వార్డు మెంబర్ పల్లిపాటి ఆనందరావు, యాసారపు సుధాకర్, పందిటి వెంకయ్య, పల్లిపాటి రవీంద్ర, పల్లిపాటి దేవదానం, రఘు, రమేష్, మావులూరి చిన తాతయ్య, పులింద్ర సురేష్, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కావ్య క్రిష్ణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.. దీనితో బోగోలు మండల కన్వీనర్ వీర రఘుకు షాక్ తగిలిందని చెప్పాలి.
Admin
Amaravathi Jyothi