Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు యువతికి జాతీయ స్థాయి పేటెంట్ గుడ్లూరు,అమరావతి జ్యోతి: మండల కేంద్రమైన గుడ్లూరుకు చెందిన కాకుమాని మృదులా చౌదరికి జాతీయ స్థాయి పేటెంట్ లభించింది దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు అధ్యాపకులు ఆమెను అభినందించారు."యాన్ ఎడిబుల్ ఫ్లేవర్ ఎన్ హాన్స్ ఫ్రమ్ పెరిగోప్తలిస్ పార్దాలిస్" అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తను యు.కె లోని మాంచెస్టర్ లో "ఇంటర్టెక్ ఫార్మాసెటికల్ సర్వీసెస్" లో సీనియర్ అనలెస్ట్ గా పనిచేస్తుంది.ఈ యువతి తండ్రి చనిపోయినా పట్టుదలతో కష్టపడి యు.కె లో ఎమ్.ఎస్ పూర్తి చేసి ఉద్యోగం మరియు స్పాన్సర్షిప్ సంపాదించింది.అలానే జాతీయ స్థాయి పేటెంట్ ను కూడా తెచ్చుకొని ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Admin
Amaravathi Jyothi