Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరులో రంగా 35 వ వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించిన జనసేన నాయకులు గుడ్లూరు,అమరావతి జ్యోతి; మండల కేంద్రములోని బస్టాండ్ సెంటర్ వద్ద గుడ్లూరు మండల జనసేన ఆద్వర్యంలో కీర్తి శేషులు వంగవీటి మోహన రంగా 35 వ వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు బిసి నేత దేవళ్ళ భాస్కర్ రావ్, తోట శ్రీహరి నాయుడు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈసందర్భంగా భాస్కర్ రావ్ మాట్లాడుతూ మనందరి చిరస్మరణీయుడు ఆదర్శప్రాయమైన అభిమాన నాయకుడు కీర్తి శేషులు వంగవీటి రంగా ఆశయాలను మనమంతా పుణికి పుచ్చుకోవాలి అన్నారు. ఒక సామాన్యుడిగా చిన్నపాటి మెకానిక్ వర్క్ చేసుకుంటూ నాటి పరిస్థితులకు అనుగుణంగా పేదల కోసం వారికి అండగా నిలిచిన ధీశాలి మోహన్ రంగా. ఎలాంటి పరిస్థితులనైనా ఎంతటి వారైనా ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యశాలి. చివరగా బడుగు బలహీన వర్గాలలో పేదల ఇళ్ళ స్థలాల కోసం 1988 డిసెంబర్ 22 నఆమరణ నిరహార దీక్ష చేపట్టి కొంతమంది దుండగుల కుయుక్తులకు డిసెంబర్ 26 న బలయిన వ్యక్తి రంగా .ఏది ఏమైనా ఆ మహనీయుని ఆశయాలు పవన్ కల్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ తరపున ముందుకు తీసుకు వెళ్తామని ప్రకటించారు. పై కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు మూలగిరి శ్రీనివాస్ అన్నంగి చలపతి అనిమిశెట్టి మాధవ రావు పాటి మహేష్ గౌడపేరు రమేష్ షేక్ రహంతుల్లా పసుపులేటి మల్లిఖార్జున ఆలా కిషోర్ కొనికి రాజేష్ రామ్ చరణ్ దిలీప్ కుమార్ మొగిలిశెట్టి రాజా గుండెమడుగుల భాస్కర్ సన్నిశెట్టి హరిబాబు భైరవరపు రాజా జాహ్నవి కుంచాల అంకమరావు శివాజీ టీకనం నాగరాజు టీకనం మారుతి ఆలా శివ కంఠా హజరత్తయ్య రామిశెట్టి సుబ్బారావు రాజశేఖర్ రాంబాబు కేసారపు లక్ష్మణ్ సురేష్ హిమసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi