Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆర్య వైశ్య కార్పోరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రారంభించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడం నా జీవితంలో మరిచిపోలేని రోజని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఆయన మనకోసం మన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు మరువలేనివని.. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయాలని కోరారు. ఆర్యవైశ్య సోదరులు నా కుటుంబ సభ్యులని.. వారికి అర్ధరాత్రి కష్టమొచ్చినా ఇంటూరి నాగేశ్వరావు అండగా ఉంటాడని తెలిపారు.
Admin
Amaravathi Jyothi