Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దొంగ ఓట్ల సంస్కృతి టిడిపిదే. కందుకూరు అమరావతి జ్యోతి: . దొంగ ఓట్లను చేర్చుకునే సంస్కృతి ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ దేనని, వారు చేసే తప్పును వైసీపీ మీదకు నెట్టడం అహేతుకమైన చర్యని ఆ పార్టీ నాయకులు చీమల రాజా ఘాటుగా విమర్శించారు ఆదివారం సాయంత్రం స్థానిక వైకాపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని విమర్శించడం వల్ల ఖ్యాతి పొందవచ్చనే దుగ్దతో ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహరించడంను ప్రజలు చీత్కరిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ మాట్లాడుతూ కందుకూరు ఆరో వార్డులోని సుందరయ్య నగర్ లో తుఫాన్ నేపథ్యంలో అక్కడ ప్రజలకు దుప్పట్లు భోజనాలు ఏర్పాటు చేసిన వైకాపాను అనవసరంగా విమర్శిస్తూ అక్కడ మంచినీళ్ళ సదుపాయం లేదని కల్లబొల్లి మాటలు ఇంటూరి మాట్లాడడం సబబు కాదన్నారు జె సి ఎస్ కోఆర్డినేటర్ ఎం కిషోర్ మాట్లాడుతూ 138 ,124 ,107, 108 బూతుల్లో ఓట్లు తొలగించమని టిడిపి వారు బిఎల్ఓ లను సైతం బెదిరిస్తున్నారని ఇది రాజకీయాల్లో సరైనది కాదని దొంగ ఓట్ల సంస్కృతికి టిడిపి ఇకనైనా తిలోదకాలు ఇవ్వాలని హితవు పలికారు .కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi