Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఉన్నం నళిని దేవి కనిగిరి అమరావతి జ్యోతి: కనిగిరిలో రా కదలిరా కార్యక్రమానికి హాజరై ఎన్నికల శంఖారావం మొదలు పెట్టిన బహిరంగ సభలో కందుకూరుకు చెందిన బిజెపి నాయకురాలు ఉన్నం నళిని దేవి చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పనిచేయాలని పార్టీలో మంచి భవిష్యత్తుఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మీ ఆదేశాలతో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి కచ్చితంగా చేస్తానని చంద్రబాబుకు నళిని దేవి హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు కందుకూరు. నుండి సుమారు 35 కార్లలో భారీ ర్యాలీగా బయలుదేరి కనిగిరి బహిరంగ సభకు వెళ్లారు.
Admin
Amaravathi Jyothi