Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : వైకాపా కు రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట.. ఒంగోలు,అమరావతి జ్యోతి: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కామెంట్స్.. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది.. మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు.. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నాం.. మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు.. ఈ 33 ఏళ్ళలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం.. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం..మాకు ఇగోలు లేవు.. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది.. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించాం.. ప్రస్తుత పరిణామాలు బాధాకరం.. ఇది ఆత్మగౌరవానికి సంబందించిన విషయం.. అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నాం.. సీఎం జగన్ నుంచి కూడా ఈ ఐదేళ్ళలో సహాయ సహకారాలు అందాయి.. ఇప్పటివరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు.. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా.. ఇవాళ వైసీపీ కి రాజీనామా చేస్తున్నా.. త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం.. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తాం...
Admin
Amaravathi Jyothi