Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు ఎమ్మెల్యే ఇంటూరి కందుకూరు: కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు, కందుకూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ అవతరణ కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి కోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.. మద్రాస్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్న ఇబ్బందులు చూసి తెలుగువారి ఐక్యత కోసం పోరాడి, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగువారి అస్తిత్వాన్ని ఎలిగేత్తి చాటి, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే కొనియాడారు... రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఆర్యవైశ్య నాయకులు తాతా లక్ష్మీనారాయణ, మురారి శెట్టి సుధీర్ కుమార్, గుర్రం అల్లూరయ్య, మురారిశెట్టి సుబ్బారావు, కొత్త వెంకటేశ్వర్లు కోట వెంకట నరసింహం కాకుమాని ప్రవీణ్, చీదేళ్ళ పిచ్చయ్య, కొత్తూరి శ్రీనివాసులు అమర మాల్యాద్రి, ఇన్నమూరి శ్రీనివాసులు పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు శ్రీను, బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, ముచ్చు వేణు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. గుడ్లూరు లో జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇన్నమూరి ప్రమీల సుధాకర్, ఇన్నమూరి గరటయ్య, కొత్తూరు శ్రీనివాసులు, అమరా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi